** YSR Vardhanthi Across The World. కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత. నల్ల బియ్యంతో గుండెజబ్బులు దూరం !. USA - Thakita Thakita. Tax services. అయ్యారే" అనిపించేనా?. వందలాదిమందికి ఉపాధి దొరుకుతుందనే.. వరుసగా సినిమాలు! _నాగార్జున అక్కినేని. Rupee up 23 paise against dollar. తిరుమలకు కాలినడకు మార్గం మూసివేత. ఒకే రోజు 111కేసులలో తీర్పు. 5 revenue boosters for Desi IT cos.
Latest News
AP Govt.
Sports
Articles
NRI
Gossips
Latest News
Business
Andhra Pradesh
India
International
Science
Greetings
Awards
Festivals
కవితలు
Interview
Photo Feature
Film Review
IT
బాబుకు అవమానంపై మండిపడ్డ నటులు


Telugu Online(TOL)- Andhra Pradesh Political News - July.21.2010: సామరస్యం, దేశభక్తికీ పెట్టింది పేరుగా ఉండే మహారాష్ట్ర ప్రతిష్టను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు హరికృష్ణ నేరుగా చవాన్ కు ఓ లేఖ రాశారు.

దొంగతనంగా తెలుగువారి జల సంపదను దోచుకునేందుకు వేసిన ఎత్తులను మానుకుని అక్రమ ప్రాజెక్టులన్నిటినీ తొలగించాలని సూచించారు. తెలుగు నేతల అరెస్టుతో తెలుగువారు ఉగ్రసింహాలై మీపైకి ఉరకక ముందే మేలుకొని తప్పును సరిదిద్దుకోమని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా హరికృష్ణ విరుచుక పడ్డారు. తెలుగువారికి అవమానం జరుగుతున్నా కళ్లు మూసుకుని కూచున్న కాంగ్రెస్ పార్టీకి చేటు కాలం దాపురించిందన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ నటుడు మోహన్ బాబు కూడా రాజకీయాలకు అతీతంగా స్పందించారు. తెలుగువారిపై మరాఠా పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. బాబ్లీ ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తెలుగు బిడ్డలపై మరాఠీ సర్కారు దౌర్జన్య చర్యలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబ్లీ సమస్య ప్రతి ప్రతి తెలుగోడి సమస్య అని, తెలుగు ప్రజలు హృదయపూర్వకంగా స్పదించాలని అన్నారు. మహారాష్ట్ర పోలీసులు తెదేపా నేతలపై లాఠీఛార్జీ చేసినప్పుడు తన హృదయం ఆవేదనతో రగిలిపోయిందని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

టీడీపీ నేతల పట్ల మహారాష్ట్ర పోలీసుల వైఖరికి నిరసనగా సినీ నటుడు మోహన్ బాబు మంగళవారం వందలాది మంది విద్యార్థులతో రంగంపేట నుంచి తిరుపతి వరకు ర్యాలీగా బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా యాత్ర చేపట్టవచ్చునని, ఇందుకు అనుమతి అక్కర్లేదని అన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల పట్ల వ్యవహరించిన తీరుకు మండిపడ్డ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు వాడి దమ్ము, పౌరుషం ఏమిటో చూపిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రంలోనూ, రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉన్నందున కాంగ్రెసుకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం మరోసారి ప్రమాదంలో పడిందన్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు కూడా తాము వారసులమని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు.

Related Links

•  YSR Vardhanthi Across The World

•  ఎవరున్నా లేకున్నా జనబలమే మిన్న: జగన్

•  విజయమ్మకు రోశయ్య సానుభూతి లేఖ

•  న్యూజిలాండ్ లో భూకంపం భారీ ఆస్తి నష్టం

•  యాహూ సెర్చ్ ఇంజన్ టాప్ టెన్ జాబితా లో సోనియా,జగన్

•  కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత

•  తిండి.. బట్ట.. రొమాన్స్!

•  చెక్ బౌన్స్ కాంట్రవర్సీ‍లో "కొమరం పులి"

•  వైభవోపేతంగా రజనీ తనయ వివాహం!

•  ప్రకాశంలో ప్రారంభమైన ఓదార్పు

Latest news

•  ఎవరున్నా లేకున్నా జనబలమే మిన్న: జగన్

•  కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత

•  చెక్ బౌన్స్ కాంట్రవర్సీ‍లో "కొమరం పులి"

•  ప్రకాశంలో ప్రారంభమైన ఓదార్పు

•  వైఎస్ వర్ధంతి కార్యక్రమాల తీరుపై అధిష్టానం ఆరా

•  మహానేతకు రాష్ట్ర ప్రజల ఘననివాళి

•  జగన్ కు దానం హితవచనాలు

•  రాజశేఖరరెడ్డిని "ఆస్తి"గా ప్రకటించిన అధిష్టానం

•  వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ వివేకానందరెడ్డి

•  రోశయ్య అడ్డాలో వైఎస్ విగ్రహానికి నో !

Head Lines
eSeva|| Food|| Grocery|| Tourism|| Travel|| Yoga|| Contact us|| Advertise|| Contribute|| FeedBack
Contact: CEO - venu@teluguonline.net, editor@teluguonline.net 
Copyright © 2009-2010www.teluguonline.net. All rights reserved.
No part of this site should be used in any other media without prior permission.
IT & Technical support by - Krify