Telugu Online(TOL)- India news - July.26.2010: సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపకం, ఇతర ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో ఉమ్మడి పోరాటానికి ప్రతిపక్షాలన్నీ సమాయత్తం వర్షాకాల సమావేశాలు యుద్ధవాతావరణాన్ని తలపించనున్నాయి. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్తంభింపజేసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను ఈసరికే సిద్ధం చేసుకున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుతో పాటు దానిని సందర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నామా నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర పోలీసులు దురుసుగా వ్యవహరించి తీరుపై కూడా ఉభయ సభల్లో అలజడి రేగనుంది.
అన్ని రాజకీయ పక్షాల నాయకులతో లోకసభ స్పీకర్ మీరాకుమార్ ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్సింగ్ అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు.